KTR:బీజేపీ..బలాత్కార్ జస్టిఫికేషన్ పార్టీ

41
- Advertisement -

ట్విట్టర్ వేదికగా బీజేపీపై విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత. బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషుల్లో ఒకరు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో స్టేజీ పంచుకున్న ఫొటోను ట్వీట్ చేస్తూ కేటీఆర్, కవిత విమర్శలు గుప్పించారు.

బిల్కిస్ బానో రేపిస్ట్ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో బహిరంగంగా వేదిక పంచుకుంటాడు. మహిళలపై క్రూరమైన నేరాలకు పాల్పడేవారికి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటూ సంబరాలు చేసుకుంటున్న సమాజంగా మనం ఏమైపోయాం. భారతదేశం చూస్తోంది! అంటూ పేర్కొన్నారు కవిత.

బీజేపీ అంటే.. బలాత్కార్ జస్టిఫికేషన్ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. బిల్కిస్ బావో కేసు దోషులతో బీజేపీ నేతలు సన్నిహితంగా ఉండటం ఆ పార్టీ విధానాలను తెలియజేస్తుందని ట్విట్టర్‌లో కామెంట్ పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -