మంత్రి కేటీఆర్‌కు వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం ఆహ్వానం..

147
- Advertisement -

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కు మ‌రోసారి వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం నుంచి ఆహ్వానం అందింది. దావోస్‌లో 2022లో జ‌రిగే డ‌బ్ల్యూఈఎఫ్ వార్షిక స‌మావేశానికి హాజరు కావాల‌ని కేటీఆర్‌ను డ‌బ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే ఆహ్వానించారు. ఈ స‌మావేశం జ‌న‌వ‌రి 17 నుంచి 21 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. తెలంగాణ‌ను సాంకేతిక శ‌క్తి కేంద్రంగా మార్చేందుకు కేటీఆర్ చేస్తున్న కృషిని బోర్గే బ్రెండే ప్ర‌శంసించారు.

డ‌బ్ల్యూఈఎఫ్ నుంచి ఆహ్వానం అందుకున్న మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, ఇండస్ట్రీ, ఇన్నోవేష‌న్ రంగాల్లో తెలంగాణ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు గుర్తింపుగా ఈ ఆహ్వానాన్ని భావిస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం యొక్క‌ స్నేహపూర్వక పారిశ్రామిక విధానాలను తెలియ‌ప‌రిచేందుకు, రాష్ట్రంలో గ్లోబ‌ల్ సంస్థ‌లు పెట్టుబ‌డులు పెట్టేందుకు ఈ ఆహ్వానం మ‌రో అవ‌కాశం అని మంత్రి పేర్కొన్నారు. డ‌బ్ల్యూఈఎఫ్ స‌మావేశానికి రావాల‌ని ఆహ్వానం పంపిన‌ నిర్వాహకులకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -