కాల్‌అవే గోల్ఫ్ డిజిటెక్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

114
- Advertisement -

హైదరాబాద్‌లో అమెరికాకు చెందిన కాల్‌వే గోల్ఫ్ డిజిటెక్ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కాల్‌అవే సంస్థ ఆఫీస్‌ ఏర్పాటవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో డిజిటెక్‌ కంపెనీలు చాలా ఉన్నాయని కేటీఆర్‌ అన్నారు. ఆపిల్‌, గూగుల్‌, ఉబర్‌, నోవార్టిస్‌ వంటి సంస్థలు నగరానికి వచ్చాయని చెప్పారు.

ఆయా సంస్థల రెండో పెద్ద క్యాంపస్‌లు హైదరాబాద్‌లోనే ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అమెజాన్‌ అతిపెద్ద సెంటర్‌ నగరంలో ఉన్నదని కేటీఆర్‌ అన్నారు. కాల్‌అవే కూడా మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు.

- Advertisement -