రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్…

337
ktr
- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు మంత్రి కేటీఆర్. తన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జిల్లెల్ల నుంచి ముస్తాబాద్‌ మధ్యలో రూ. 2.50 కోట్లతో నిర్మించిన వంతెనను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

అనంతరం ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది ,హనుమాన్ నగర్ గ్రామాలలో కోటి పదిహేను లక్షల వ్యయంతో నిర్మించిన వంతెనలను ప్రారంభించారు. అలాగే ముస్తాబాద్ మండల కేంద్రంలో 30 లక్షల రూపాయలతో నిర్మించిన సెస్‌ నూతన భవనాన్ని ప్రారంభించారు.

దీంతో పాటు పోతుగల్‌ – గండిలచ్చాపేట రోడ్డులో నూతనంగా నిర్మించిన వంతెనను, కొండాపూర్‌ – నారాయణపూర్‌ బ్రిడ్జిని ప్రారంభించారు.

- Advertisement -