అనాథ బాలికకు అండగా నిలిచిన కేటీఆర్..

243
KTR
- Advertisement -

ఓ అనాథ బాలికకు టీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అండగా నిలిచి తన మంచి మనసుని మరోసారి చాటుకున్నారు.ఇక అసలు విషయానికొస్తే.. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మద్దికుంట కమలవ్వ అనారోగ్య సమస్యతో గతకొంత కాలంగా బాధపడుతూ వారంరోజుల క్రింద మరణించింది. తల్లి మరణంతో కూతురు రజిత అనాధగా మారింది. ఈ విషయం సామాజిక మాంద్యమాల ద్వారా తెలుసుకున్న కేటీఆర్ స్పందిస్తూ ట్విట్టర్‌లో ట్విట్ చేశారు.

కేటీఆర్‌ వెంటనే స్పందిస్తూ ఆ బాలికకు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్‌కి సూచించారు. వెంటనే జిల్లా కలెక్టర్ DRO ఖిమ్యా నాయక్‌ని, DEO రాధా కిషన్‌ని కమలవ్వ ఇంటికి పంపించారు. తక్షణ సహాయం కింద 50 వేల చెక్కును అందిచారు. రజిత పరిస్థితిని జిల్లా అధికారులకు వివరించాము. వారు తనకు అన్నివిధాలుగా అండగా ఉంటామని చెప్పారు. రజిత కోరిక మేరకు MPHW కోర్సులో ప్రవేశం కల్పిస్తూ వెంటనే నిర్ణయం తీసుకున్నారు. తంగళ్ళపల్లి KGBVలో ఉండటానికి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూంలో అవకాశం కల్పిస్తామని చెప్పారు.

- Advertisement -