వరద బాధితలకు ఆర్థిక సాయం అందించిన మంత్రి కేటీఆర్‌..

221
ktr
- Advertisement -

హైదరాబాద్‌లో ముంపు ప్రభావిత కుటుంబాలకు తక్షణ సాయంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించిన పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈరోజు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పలువురికి అందించారు. ఖైరతాబాద్‌లోని ఎమ్మెస్ మక్త మరియు రాజు నగర్‌లో ముంపు ప్రభావానికి గురైన పలు కుటుంబాలను కలిసి.. వారితో మాట్లాడి, తక్షణ సాయంగా ప్రభుత్వం తరపున పదివేల రూపాయల నగదును మంత్రులు అందించారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ విజయ రెడ్డి లు మంత్రుల వెంట ఉన్నారు.

వరద ప్రభావానికి గురైన కుటుంబాలకు ఇంటికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించి ఆపద్బాంధవుడిగా నిలిచిన సీఎం కేసీఆర్. వర్షాలు, వరదల వల్ల ఇండ్లు పూర్తిగా కూలిపోయిన వారికి లక్ష రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు చెప్పారు. ఇందుకోసం పురపాలకశాఖకు తక్షణం రూ.550 కోట్లు విడుదల చేశారు.

- Advertisement -