నోట్లరద్దుకు ఆరేళ్లు:కేటీఆర్‌

221
- Advertisement -

విఫల నోట్ల రద్దు నిర్ణయానికి ఆరు సంవత్సరాలు పూర్తి

• నోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసిందన్న కేటీఆర్

• నోట్లను రద్దు చేసిన తర్వాత కొత్తగా మరో 12.91లక్షల కోట్ల నగదు చలామనీలోకి వచ్చింది

• చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రికార్డు స్ధాయిలో 30.88 లక్షల కోట్లకు నగదు చలామనీ పెరిగింది

• నల్లధనం వెలికి తీయడం, నకిలీ కరెన్సీని అరికట్టడం, తీవ్రవాదానికి నిధులు ఆపడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసమే నోట్ల రద్దు అంటూ బిజెపి ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ అవాస్తవాలేనని తేలిపోయింది

• నోట్ల రద్దు వల్లనే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది

• వేలాది కంపెనీలు మూతపడ్డాయి, నిరుద్యోగం పెచ్చరిల్లింది

• ప్రభుత్వాలు పన్ను రాబడిన సైతం తగ్గి సంక్షేమ కార్యక్రమాల అమలుకి దెబ్బ తగిలింది

• విఫల నోట్ల రద్దు నిర్ణయం పైన ఇప్పటికైనా ప్రధానమంత్రి దేశానికి క్షమాపణ చెప్పాలి

• కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టేందుకు అర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలన్న కేటీఆర్ సూచన

నేటితో దేశంలోని ఆర్థిక వ్యవస్థ దురావస్థకి, పతనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ఆర్థిక విధానాలే ప్రధాన కారణమని కేటీఆర్ అన్నారు. పురోగమనం దిశగా అడుగులు వేస్తున్న భారత దేశ ఆర్థిక వ్యవస్థను నరేంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయంతో దారుణంగా దెబ్బతీశారని మంత్రి కేటీఆర్ అన్నారు. నవంబర్ 8వ తేదీ 2016న ఇదే రోజు దేశంలోని నోట్లన్నింటిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన భారత దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని కేటీఆర్ అన్నారు.

నల్లధనం వెలికి తీయడం, నకిలీ కరెన్సీని అరికట్టడం, తీవ్రవాదానికి నిధులు ఆపడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసమే నోట్ల రద్దు అంటూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ అవాస్తవాలేనని తేలిపోయిందన్నారు. రేపటితో నోట్ల రద్దు లాంటి విఫల నిర్ణయానికి ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా నోట్ల రద్దు దుష్పఫలితాలను గుర్తు చేస్తూ, వాటికి భాద్యత తీసుకోని ప్రధానిపై కెటిఆర్ మండిపడ్డారు. నోట్ల రద్దు నిర్ణయం ఆర్థిక వ్యవస్థను కుంగదీసిన ఘోర వైఫల్యమని, ప్రధాని చెప్పిన ఒక్క లక్ష్యం కూడా నెరవేరని ఆర్థిక వైపరీత్యం అన్నారు.

నోట్ల రద్దు నిర్ణయం తర్వతా ఈ రోజు అర్ధిక వ్యవస్దలో సూమారు 30.88లక్షల కోట్ల నగదు ప్రజల వద్ద ఉండడం నోట్ల రద్దుపైన బిజెపి చెప్పిన అన్ని మాటలు ఆసత్యాలే అని తెలిపోయిందన్నారు. 2016 లో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత 2017 జనవరి నాటికి 17.97 లక్షల కోట్ల రూపాయలు చలామణిలో ఉండేవని, అయితే ప్రస్తుతం అది 72 శాతం పెరిగి రికార్డు స్ధాయిలో 30.88 లక్షల కోట్లకు పెరిగిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

2016 నుంచి అదనంగా 12.91లక్షల కోట్ల నగదు కొత్తగా చలామనీలోకి వచ్చిందన్నారు. నోట్ల రద్దు చేసిన 2016 నుంచి ప్రతి ఏటా ఆర్థిక వ్యవస్థలో తమ లావాదేవీల కోసం నగదుని వినియోగిస్తున్న ప్రజలు శాతం క్రమంగా పెరుగుతూ వస్తున్నదని కేంద్ర ప్రభుత్వ గణంకాలు నిరూపిస్తున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తక్కువ నగదు ఉన్న ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, లావాదేవీలు డిజిటలైజేషన్, బ్యాంకుల నుంచి నగదు తీసుకోవడం, నగదు డిపాజిట్ చేయడం వంటి వాటిపైన పెద్ద ఎత్తున పరిమితులు పెట్టినా, కేంద్రం పేర్కొన్న తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థ లక్ష్యం నెరవేరలేదు అన్నారు.

కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న మీద నగదు రహిత ఆర్థిక వ్యవస్థను నిర్మాణం చేయడంలో పూర్తిగా విఫలమైందని… కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం నోట్ల రద్దు విజయం సాధించిందని గొప్పలు చెప్పుకుంటున్నదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రద్దయిన పెద్దనోట్ల సొమ్ము లో 99.3 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని అర్బీఐ గణాంకాలతో సహా ప్రకటించిందన్నారు.

రద్దయిన పెద్ద నోట్ల విలువ 15.41 లక్షల కోట్లుకాగా.. తిరిగి డిపాజిట్ ఐన వాటి విలువ 15.31 లక్షల కోట్లని తెలిపిందన్నారు. లక్షల కోట్ల నల్లధనాన్ని పట్టుకోవడానికే నోట్ల రద్దు అస్త్రం ప్రయోగించమాని ప్రకటించుకున్న కేంద్రం.. చివరికి తెల్ల ముఖం వేయాల్సి వచ్చిందని, కొత్త నోట్ల ముద్రణకు ఆర్బీఐకి 21వేల కోట్ల ఖర్చు కావడం తప్ప సాధించింది శూన్యమని కెటిఆర్ తెలిపారు. ఇప్పటికి దేశంలో సుమారు కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు లేవని, 50 శాతం పైగా ఈ -కామర్స్ లావాదేవీల్లో సైతం క్యాష్ అండ్ డెలివరీ పద్ధతిని వినియోగిస్తూ తమ లావాదేవీల కోసం నగదునే ఉపయోగిస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆలోచన లేకుండా అర్థరహితంగా తీసుకున్న నిర్ణయాల వల్లనే ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో కొనసాగుతున్నదని ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గ్రహిస్తే మంచిదని కేటీఆర్ సూచించారు. నోట్ల రద్దు, కరోనా లాక్‌డౌన్ వంటి వాటిని అర్దిక వ్యవస్ధ పతనానికి కారణాలుగా చూపిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం, లాక్ డౌన్ కన్నా ముందే 2020 నాటికి వరుసగా ఎనిమిది త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ తిరోగమన దశలో ఉన్న విషయాన్ని దాచి ఉంచుతుందన్నారు.

ప్రధానమంత్రి అనాలోచితం నిర్ణయం వల్లనే ఈరోజు దేశంలోని ప్రజలు, ప్రభుత్వాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. నోట్ల రద్దు, కరోనా వలన పెద్ద ఎత్తున సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమలు నుంచి మొదలుకొని భారీ పరిశ్రమల దాకా అనేక ఇబ్బందులు ఎదుర్కోన్నాయని, లక్షలాది పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. పరిశ్రమలు మూతపడడంతో నిరుద్యోగం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది అన్నారు.

ప్రజలు నిరుద్యోగుల మారడంతో 2016 నుంచి 2019 మద్య సూమారు 50 లక్షల ఉద్యోగాలు కొల్పోయారని, 2016లో 88 లక్షల మంది కనీసం ఐటి రిటర్న్ లు సైతం దాఖలు చేయలేకపోయారన్నారు. ఒకవైపు పారిశ్రామిక ఉత్పత్తి, ఆర్థిక వ్యవస్థలో కొనుగోళ్లు తగ్గడంతో ప్రభుత్వాల పన్ను రాబడి సైతం అత్యధికంగా పడిపోయిందని, దీంతో ఆయా ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలుపైన తీవ్రమైన నకారాత్మక ప్రభావం కలిగిందన్నారు.

50 రోజుల సమయం ఇవ్వాలని తన నోట్ల రద్దు నిర్ణయం తప్పయితే, సజీవంగా దహనం చేయాలని అప్పుడు ప్రధానమంత్రి ప్రజలను మాటలతో మభ్యపెట్టారన్నారు. సజీవ దహనం మాట పక్కన ఉంచి కనీసం నోట్ల రద్దు దుష్పరిణామాలకు బాధ్యతను సైతం తీసుకునేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. అనేక ప్రభుత్వ రంగ సంస్ధలతోపాటు నిపుణుల అభిప్రాయం మేరకు దేశ అర్ధిక వ్యవస్ధను అడ్డంగా కూలదోసి, దేశ ప్రజల జీవితాలను తారుమారు చేసిన నోట్ల రద్దు తప్పు అని ఒప్పుకొని దేశ ప్రజానీకానికి ప్రధానమంత్రి మోడీ క్షమాపణ చెప్పాలన్నారు.

ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అనేకమైన అడ్డదిడ్డమైన, అర్ధరహితమైన నిర్ణయాలు తీసుకుంటూ రికార్డు స్దాయి నిరుద్యోగం, ద్రవ్యోల్భనం వంటి అనేక దుష్పరిణామాలతో మరింత తిరోగమనానికి దారి తీసేలా కేంద్రం వ్యవహరిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన ప్రచార పటోపాలను పక్కనపెట్టి ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అవసరమైన సానుకూల నిర్ణయాలను తీసుకోవడంపైన దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు.

ఇవి కూడా చదవండి..

కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపిన కూసుకుంట్ల..

చీతాల వేట మొదలైంది..

కోమటిరెడ్డి బ్రదర్స్ కు తగిన శాస్త్రి

- Advertisement -