మోదీకి సిగ్గు, నీతి లేవు- మంత్రి కేటీఆర్

76
- Advertisement -

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. మోదీకి సిగ్గు, నీతి అనేవి లేవని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ గడ్డపై బీజేపీకి పుట్టగతులుండవని కేటీఆర్ జోస్యం చెప్పారు. బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఒక్క పైసా తీసుకురాలేదని, మిషన్ భగీరథను మోదీ సిగ్గు లేకుండా కాపీ కొట్టారని కేటీఆర్ అన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?, మోదీని నమ్మడమే దేశం చేసిన తప్పు అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నమో అంటే.. నమ్మించి మోసం చేసినోడని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇక బీహార్‌లో ఓ వ్య‌క్తి అకౌంట్లో రూ. 10 ల‌క్ష‌లు జ‌మ అయ్యాయి. మోదీ పంపిండు అని ఆ పైస‌ల‌తో ఇల్లు క‌ట్టుకుండు. మోదీ పంపలేదు. అదంతా అబ‌ద్దం.. పైస‌లు క‌ట్టు అని బ్యాంకు అధికారి నిల‌దీస్తే ఆ వ్య‌క్తి దీక్ష చేసిండు. జ‌న్ ధ‌న్ ఖాతాలో రూ. 15 ల‌క్ష‌లు వేస్తాన‌ని మోదీ మాట మరిచారు. 2 కోట్ల ఉద్యోగాలు ప్ర‌తి సంవ‌త్స‌రం ఇస్తాన‌ని చెప్పి మోసం చేశారు. ఉద్యోగాల గురించి మీడియా ప్ర‌శ్నిస్తే.. మోదీ తెలివిగా స‌మాధానం చెప్పాడు. మీ సిరిసిల్ల హాస్పిట‌ల్ ముంద‌ట ప‌కోడి వేసుకోవ‌డం ఉద్యోగం క‌దా? అని మోదీ అంటున్నాడ‌ని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

- Advertisement -