టాస్ గెలిచిన వెస్టిండీస్.. భారత్ బ్యాటింగ్..

127
- Advertisement -

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా లక్ష్యాన్ని ఛేదించిన తీరుతో వెస్టిండీస్ ఇవాళ్టి మ్యాచ్‌లో మరో ఆలోచనకు తావులేకుండా లక్ష్యఛేదనకు మొగ్గుచూపింది. తొలి మ్యాచ్‌ను నెగ్గిన ఊపులో ఉన్న టీమిండియా నేటి మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతోంది. వెస్టిండీస్ జట్టులో ఒక మార్పు చేశారు. ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ జట్టులోకి రాగా, ఫాబియన్ అలెన్ ను తప్పించారు.

తుది జట్లు :

భారత్‌: రోహిత్ శ‌ర్మ (కెప్టెన్‌), ఇషాన్‌, విరాట్‌ కోహ్లీ, రిష‌బ్‌ పంత్ (వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాద‌వ్‌, వెంకటేశ్ అయ్య‌ర్‌, దీప‌క్ చాహ‌ర్, భువనేశ్వర్ కుమార్, హర్షల్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌, చాహల్‌.

విండీస్‌: బ్రాండన్‌ కింగ్‌, కైల్‌ మేయర్స్‌, నికోల‌స్ పూరన్‌(వికెట్ కీప‌ర్), పావెల్‌, కీర‌న్‌ పొలార్డ్‌ (కెప్టెన్‌), హోల్డర్‌, రోస్టన్ ఛేజ్, షెఫర్డ్‌, ఒడీన్‌ స్మిత్‌, అకీల్‌ హోసేన్‌, కాట్రెల్‌.

- Advertisement -