కాంగ్రెస్ నేతలకు నిద్రలేని రాత్రులే: కేటీఆర్

674
ktr
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో కాంగ్రెస్ నేతలకు నిద్రపట్టడం లేదని మండిపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ్‌ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ …తెలంగాణ రైతుల పొలాలు పచ్చగా అవుతుంటే కాంగ్రెస్ నేతల కళ్లు ఎర్రబడుతున్నాయని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ నేతలు విచక్షణ లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు…. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కాంగ్రెస్ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం లేక ఎక్కడికక్కడ ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారని చెప్పారు.

నగరంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామన్నారు. గతంలో ఎండాకాలం వస్తే జలమండలి కార్యాలయం ముందు ప్రదర్శనలు జరిగేవి…. కానీ ప్రస్తుతం ఆ పరిస్ధితి లేదన్నారు. గతంలో నిజాంపేట, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో 14 రోజులకోసారి నీళ్లు వచ్చేవి. ఇప్పుడు నిజాంపేట, కుత్బుల్లాపూర్‌లో రెండు రోజులకోసారి నీళ్లిస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు.

దేశంలోనే ఎక్కడా లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలు చేస్తున్నాం. ఐదేళ్లలోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశమే అబ్బురపడే విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. కారుచీకట్ల నుంచి 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు. హైదరాబాద్‌లో శాంతి, భద్రతలు అద్భుతంగా ఉన్నాయి. గతంలో గణేష్ పండుగ వస్తే కర్ఫ్యూ విధించేవాళ్లు. ఇప్పుడు కర్ఫ్యూలు లేకుండా శాంతి భద్రతలను అద్భుతంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -