KTR:అమ్మమ్మ జ్ఞాపకార్థం స్కూల్ భవనం

14
- Advertisement -

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. తన అమ్మమ్మ జ్ఞాపకార్థం స్కూల్ భవనాన్ని నిర్మించారు.స‌క‌ల స‌దుపాయాల‌తో రెండు అంత‌స్తుల స్కూల్ బిల్డింగ్‌ను క‌ట్టించగా ఆ భవనం రెడీ అయింది. దీనిని ట్విట్టర్ ఎక్స్ ద్వారా షేర్ చేశారు కేటీఆర్.

అమ్మ‌మ్మ ల‌క్ష్మీ, తాత జే కేశ‌వ‌రావు జ్ఞాప‌కార్థం త‌న వ్య‌క్తిగ‌తంగా కొత్త పాఠ‌శాల భ‌వ‌నాన్ని నిర్మించాను. కొన్ని తుది మెరుగులు మిన‌హా ఈ భ‌వ‌నం దాదాపు పూర్త‌యిందని తెలిపారు. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామ‌ని ప్ర‌క‌టించారు. సిరిసిల్ల జిల్లా చొప్ప‌దండి నియోజ‌క‌వ‌ర్గంలోని కొదురుపాక‌లో ఈ స్కూల్ భ‌వ‌నాన్ని నిర్మించిన‌ట్లు కేటీఆర్ తెలిపారు.

Also Read:Allu Arjun: హ్యాపీ బర్త్ డే బన్నీ

- Advertisement -