బ్లీడ్ బ్లూ..టీమిండియాకు కేటీఆర్ అభినందనలు

442
ktr team india
- Advertisement -

ప్రపంచకప్‌ టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది కోహ్లీ సేన. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. రోహిత్ అద్భుత సెంచరీతో భారత్ సెమీస్‌ చేరడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ నేపథ్యంలో టీమిండియాకు అభినందనలు వెల్లువెత్తుతుండగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషెస్‌ చెప్పారు. ప్రపంచకప్‌ సాధించేందుకు మరో రెండు విజయాల దూరంలో భారత జట్టు నిలిచిందని బ్లీడ్ బ్లూ అనే హాష్‌ ట్యాగ్‌ను జత చేశారు కేటీఆర్.

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 314 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 286 పరుగులకే ఆలౌటై సెమీస్ రేసు నుంచి తప్పుకుంది.

- Advertisement -