రుణం కట్లేదని ఇంత దారుణమా అని ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు కేటీఆర్. నాటి కాంగ్రెస్ పాలనలో..అన్నదాతలు అప్పు కట్టలేదని..ఆడబిడ్డల పుస్తెలు లాక్కెళ్లే దుస్థితి..రైతుల ఇళ్ల దర్వజాలు తీసుకెళ్లే పరిస్థితి..కరెంట్ మోటర్లు, స్టార్టర్లు తీసుకెళ్లే దైన్యస్థితి ఉందన్నారు.
స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..మళ్లీ ఆనాటి దృశ్యాలు కళ్లముందుకు తెచ్చింది..కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని.. ఏకంగా ఇంటికి ఉన్న గేటును ఎత్తుకెళతారా ?, మరి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని..మాటతప్పిన ముఖ్యమంత్రిపై చర్య తీసుకునే ధైర్యముందా ? అన్నారు.
రుణం తీర్చలేదని రైతుపై చూపిన ప్రతాపాన్ని..రుణమాఫీ చేయని రేవంత్ పై చూపించగలరా ?, పేద రైతుకు ఒక న్యాయం..పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా..??
గుర్తుపెట్టుకోండి.. రైతులు అంతా గమనిస్తున్నారు..ఇలాంటి ఘోరాలను చూస్తూ ఊరుకోరు..కాంగ్రెస్ నేతల్ని ఇంటి గేటు కూడా తొక్కనియ్యరు అని మండిపడ్డారు.
రుణం కట్టలేదని.. ఇంత దారుణమా ?
నాటి కాంగ్రెస్ పాలనలో..
అన్నదాతలు అప్పు కట్టలేదని..
ఆడబిడ్డల పుస్తెలు లాక్కెళ్లే దుస్థితి..
రైతుల ఇళ్ల దర్వజాలు తీసుకెళ్లే పరిస్థితి..
కరెంట్ మోటర్లు, స్టార్టర్లు తీసుకెళ్లే దైన్యస్థితి..స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..
మళ్లీ… pic.twitter.com/NzJlFk7zA9— KTR (@KTRBRS) February 13, 2025
Also Read:దేశానికే రోల్ మోడల్గా సమగ్ర కుటుంబ సర్వే