ట్యూటర్‌ ను పెట్టుకొని మరీ..

28
- Advertisement -

పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’లో ప్రభాస్‌కు జోడీగా నటిస్తున్నారు హీరోయిన్ కృతిసనన్. ఈ మూవీ ప్రమోషన్లలో ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘ఆదిపురుష్‌లో జానకి లాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తాయి. దీన్ని సినిమాగా కాకుండా జీవితంలా భావిస్తా. ఈ మూవీ తెలుగులోనూ విడుదల అవుతుండటంతో ఒక ట్యూటర్‌ను పెట్టుకొని మరీ తెలుగు నేర్చుకున్నా’ అని వెల్లడించారు. ఆదిపురుష్ లో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తోన్నాడు అనగానే అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయింది.

అన్నట్టు ఆదిపురుష్ చిత్రాన్ని ఒకే స‌మ‌యంలో 15 దేశీయ‌, అంత‌ర్జాతీయ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ సినిమాలో రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. గ్రాఫిక్స్ కి అత్యంత ప్రాధాన్యత వున్న ఈ మూవీని మోషన్ కాప్చర్ విధానంలో షూట్ చేస్తున్నారు. అంటే.. నటీనటుల కదలికలు, హావభావాలు రికార్డు చేసి, వాటికి సాంకేతికత సాయంతో మిగిలిన హంగులను జోడిస్తారు. దీనివల్ల సినిమా చూడడానికి బాగా ఆసక్తికరంగా ఉంటుంది.

Also Read: హిడింబ ట్రైలర్ అదిరిపోయింది: సాయి ధరమ్ తేజ్

ఈ హై-బడ్జెట్ చిత్రంలో సన్నీ సింగ్ కూడా కీలక పాత్రలో కనిపించాడు. జూన్ 16, 2023న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. వచ్చే వారం నుంచి చిత్ర బృందం ప్రమోషన్స్ కోసం రెడీ అవుతోంది. బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ప్రభాస్ తో దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమా చేయడం నిజంగా విశేషమే. మరి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ ను సాధిస్తోందో చూడాలి.

Also Read: IIFA:విక్కీని పక్కకు తోసిన సల్మాన్ బాడీగార్డ్స్‌..

- Advertisement -