కృష్ణా నీటి విడుదల ఉత్తర్వులు జారీ

397
Krishna River board
- Advertisement -

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4వ తేదీ నుంచి వినియోగం కోసం రెండు రాష్ర్టాలకు నీటి కేటాయింపులు చేసింది. తెలంగాణకు 79 టీఎంసీలు, ఏపీకి 69.346 టీఎంసీలు నీరు విడుదలకు అనుమతి తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అవసరాల కోసం పోతిరెడ్డిపాడు ద్వారా 3.03టీఎంపీలు, హంద్రీనీవా-ముచ్చుముర్రి ఎత్తిపోతలల ద్వారా 9.743టీఎంసీలు కేటాయించగా.. తెలంగాణ అవసరాల కోసం కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 15 టీఎంసీలు, నాగార్జునసాగర్ ఎడమకాల్వ ద్వారా 45 టీఎంసీలు, ఏమ్మార్పీ, హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 17 టీఎంసీలు, మిషన్ భగీరథ కోసం మరో 2 టీఎంసీలను కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. నవంబర్ నెల వరకు తాగు, సాగునీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాలకు నీటి కేటాయించినట్లు తెలిపారు.

- Advertisement -