అలనాటి నటి కృష్ణకుమారి… ఇకలేరు

276
Krishna Kumari is no more
- Advertisement -

అలనాటి అందాల తార కృష్ణకుమారి ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ బెంగళూరులో కన్నుమూశారు. 1933 మార్చి 6న బెంగాల్‌లో జన్మించిన ఆమె తెలుగు,తమిళం,కన్నడ భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

1951లో ‘నవ్వితే నవరత్నాలు’ అనే చిత్రం ద్వారా తెరంగ్రేటం చేశారు. పల్లె పడుచు, బంగారు పాప చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలవేల్పు, జయ విజయ, అభిమానం, దేవాంతకుడు, భార్యాభర్తలు, కులగోత్రాలు తదితర చిత్రాల్లో నటించారు. ఏన్టీఆర్‌, ఏఎన్నార్‌ వంటి అగ్రనటులతో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు.

నటి షావుకారు జానకి ఈమె అక్క. సుమారు 110కి పైగా తెలుగు సినిమాల్లో కృష్ణకుమారి నటించారు. బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్ ను పెళ్లాడిన ఆమె అక్కడే ఉండిపోయారు. కృష్ణకుమారి దంపతులకు దీపిక అనే కుమార్తె ఉన్నారు.

- Advertisement -