ఆస్పత్రిలో చేరిన నటుడు కృష్ణ..

164
- Advertisement -

తీవ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు సీనియర్ నటుడు కృష్ణ. కాంటినెంటల్ ఆస్పత్రిలో డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కృష్ణ అనారోగ్యంకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవలె కృష్ణ మొదటిభార్య ఇందిరా దేవి మరణించిన సంగతి తెలిసిందే.

ఆమె మరణం తర్వాత ఆయన తీవ్రంగా కుంగిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. కృష్ణ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కృష్ణ 1943, మే 31వ తేదీన గుంటూరు జిల్లాలోని తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -