‘ఎన్టీఆర్’బయెపిక్‌ దర్శకుడిగా క్రిష్..

204
Krish
- Advertisement -

దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారకరామారావు జీవితరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. దీనికి నిర్మాతగా, నటుడుగా బాలకృష్ణ వ్యవహరించబోతున్నారు. గతంలో ఈ చిత్రానికి సంభంధించి ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కొన్ని రోజుల్లో సినిమా కూడా పట్టాలెక్కనున్న సమయంలో ఉన్నట్టుండి ఈ మెగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు దర్శకుడు తేజ.

balakrishna-krish

దీంతో బాలయ్యకు ఏం చేయాలో తెలియక కొన్ని రోజులు అయోమయంలో ఉండిపోయారు. ఆ తర్వాత దర్శకత్వ బాధ్యతలను  బాలయ్య బుజాన వేసుకుబోతున్నాడన్న వార్తలు జోరుగా వినిపించాయి. రాను రాను ఈ చిత్రానికి దర్శకుడిగా కొందరు పేర్లు వినిపించాయి. ఆ లీస్టులో క్రిష్‌ జాగర్లమూడి కూడా ఉన్నారు.

ఈ తరుణంలో ఇలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ  ‘ఎన్టీఆర్’ సినిమాకు దర్శకుడిగా క్రిష్‌ వ్యవహరిస్తారని ఆయన అధికారికంగా తెలిపారు. గతంలో వీరిద్దరి కలయికలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రూపొందిన విషయం తెలిసిందే. ఇక బాలకృష్ణ మాట్లాడుతూ..ఈ కథ ఎవరు చెప్పాలని రాసుందో, ఈ రామాయణానికి వాల్మీకి ఎవరో ఇప్పుడు తెలిసింది. నా నూరవ చిత్రాన్ని చరితగా మలచిన ‘క్రిష్‌ జాగర్లమూడి’, ఈ చరిత్రకు చిత్రరూపాన్నిస్తున్నారని బాలకృష్ణ తెలిపారు.

- Advertisement -