కోటి వృక్షార్చన గ్రాండ్ సక్సెస్‌: ఎంపీ సంతోష్

246
mp santhosh
- Advertisement -

సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం విజయవంతమైందన్నారు ఎంపీ సంతోష్ కుమార్‌. 50 దేశాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం విజయవంతమైందని…పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు, మంత్రులు,ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు.

తాను జలవిహార్‌,నాగోల్‌తో పాటు సీఎం కేసీఆర్‌తో కలిసి మొక్కలు నాటానని తెలిపిన సంతోష్‌ కుమార్‌… సీఎం కేసీఆర్‌ ప్రేరణతోనే గత మూడేండ్లుగా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఒక్క గంటలో కోటి మొక్కలు నాటాలనే లక్ష్యంతో కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దీనికి మంచి స్పందన వచ్చిందని సంతోషం వ్యక్తంచేశారు. తెలంగాణలో అడవులను ఎలా సంరక్షించుకుంటున్నామనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలని ఈ చిన్న ప్రయత్నం చేశామన్నారు.

- Advertisement -