గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న మోరే భాస్కర్ రావు..

200
gc
- Advertisement -

రాజ్యసభ సభ్యులు ఎంపీ & టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదో వ వార్డు సాధన గ్రౌండ్‌లో మొక్కలు నాటారు జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ మోరే భాస్కర్ రావు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం వల్ల ఈ దేశానికి మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమని… ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ కుమార్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగ మరో ముగ్గురికి గ్రీన్ చాలెంజ్ లో విసిరారు…1) చుంచుపల్లి మండల ఎంపిపి శ్రీమతి బాదావత్ శాంతి గారు,2) మాజీ కౌన్సిలర్ శ్రీ యూసఫ్ గారు, టిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం పట్టణ మాజీ అధ్యక్షులు బండి రాజు గౌడ్‌లను ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

- Advertisement -