గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్…

213
green
- Advertisement -

హరిత తెలంగాణ సాధనకోసం, పర్యావరణ పరిరక్షణ పై ప్రజలలో చైతన్యం కలిగించేందుకు ఎంపీ జోగినపెల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మెట్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి రణవేని సుజాత – సత్యనారాయణ గారు విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించి తమ ఇంటి ఆవరణలో మొక్కలను నాటిన కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి అన్నం లావణ్య అనీల్.

ఈ సందర్భంగా అన్నం లావణ్య అనీల్ మాట్లాడుతూ కోరుట్ల పట్టణంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సూచనల మేరకు హరితహారం కార్యక్రమం విజయవంతంగా సాగిందని తెలిపారు.. అలాగే హరితహారంలో నాటిన ప్రతి మొక్క కాపాడే బాధ్యత మనమే తీసుకోవాలని కోరారు.

అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కోరుట్ల మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ గడ్డమీది పవన్, కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి గుడ్ల లక్ష్మి మనోహర్, కోరుట్ల జెడ్పిటిసి శ్రీమతి దారిశెట్టి లావణ్య రాజేష్, కోరుట్ల వైస్ ఎంపిపి శ్రీమతి చిటి స్వరూప వెంకట్రావు, ప్రముఖ వైద్యురాలు శ్రీమతి స్వీతి అనూప్ గార్లకు తలా మూడు మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరినట్లు చైర్ పర్సన్ శ్రీమతి అన్నం లావణ్య అనీల్ తెలిపారు.

- Advertisement -