ఎన్టీఆర్ కోసం కొరటాల ప్లాన్ మార్చడా?

20
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో పవర్ ప్యాక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న మూవీ ” దేవర “. కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా, జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమా కోసం కొరటాల శివ గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి. ఇక తాజాగా దేవర మూవీకి సంబంధించి ఫిలిం సర్కిల్స్ లో ఓ రూమర్ తెగ వైరల్ అవుతుంది. అదేమిటంటే ఈ మూవీని కొరటాల శివ రెండు భాగాలుగా తెరకించబోతున్నాడట.

మొదటి భాగాన్ని వచ్చేయడాది ఏప్రిల్ 5న విడుదల చేసి రెండో భాగాన్ని అదే ఏడాది చివరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. స్క్రిప్ట్ పరంగా కథ మొత్తం ఒకే భాగంలో చెప్పడం కుదరదని కొరటాల శివ రెండు భాగాలుగా ప్లాన్ చేసినట్లు టాక్. ప్రస్తుతం టూ పార్ట్స్ గా వస్తున్న మూవీస్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి. అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీని మొదట ఒకే భాగంగా అనుకున్నప్పటికీ రెండు భాగాలుగా డివైడ్ చేశాడు డైరెక్టర్ సుకుమార్. ప్రభాస్ నటించిన సలార్ విషయంలో కూడా ఇదే జరిగింది. దాంతో దేవర విషయంలో కూడా కొరటాల శివ టూ పార్ట్స్ అయితేనే బెటర్ అని భావిస్తున్నాడట. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ గా నిలిచింది. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సెకండ్ మూవీ కావడంతో దేవర మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ దేవర మూవీ తో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read:పిక్ టాక్ : అందాలతో అదరగొట్టింది

- Advertisement -