దేశానికే ఆదర్శంగా తెలంగాణ: కొప్పుల ఈశ్వర్

278
koppula eshwar
- Advertisement -

అతి తక్కువ కాలంలోనే తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొప్పుల.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమ పథకాలలో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం గా నిలిచిందన్నారు.

రాష్ట్రం రైతాంగానికి కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా కావలసినంత నీరు ఇచ్చి తద్వారా కోటి ఎకరాల మాగాణి కలను నిజం చేస్తున్న అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణకు ముందు ఎడారిని తలపించిన ప్రాంతాలు ఇప్పుడు సస్యశ్యామలంగా ఉన్నాయని చెప్పారు. వీటన్నిటికీ మూల కారకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడిన కొప్పుల తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.

- Advertisement -