ఏపీ ఎన్నికల ప్రచారంలో కొండా!

17
- Advertisement -

ఏపీలో పార్లమెంట్,అసెంబ్లీకి ఏకకాలంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఏపీలో ప్రచారం చేస్తానని తెలిపారు మాజీ మంత్రి కొండా సురేఖ. ఎన్నికల షెడ్యూల్ రాగానే.. కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తానని తెలిపారు.

గతంలో జగన్ కు ఫుల్ సపోర్ట్ గా నిలిచి.. ఆ తర్వాత వైసీపీని వీడారు కొండా సురేఖ. ఇప్పుడు షర్మిలకు మద్దతుగా.. జగన్ పై విరుచుకుపడేందుకు సిద్ధం అయ్యారు. జగన్‌పై గతంలోనూ పలు సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ.జగన్‌ లాంటి క్రూరమైన మనస్తత్వం ఉన్న వ్యక్తిని చూడలేదని ఆరోపించారు కూడా.

Also Read:Harishrao:ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు?

- Advertisement -