థర్మల్‌ ప్రాజెక్టు:కోమటిరెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి

27
- Advertisement -

తెలంగాణ శాసన సభలో విద్యుత్‌ రంగంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని …ఇందులో 10 వేల కోట్లను జగదీశ్‌ రెడ్డి తిన్నారని ఆరోపించారు కోమటిరెడ్డి.

దీనిపై ఘాటుగా స్పందించారు జగదీష్ రెడ్డి. కోమటిరెడ్డి చేసిన ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జితో లేదా కమిషన్‌తో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ విచారణలో దోషులు దొరికితే వాళ్లకు శిక్ష వేయాలన్నారు. లేదంటే ఆధారాలు లేకుండా అసంబద్ధ ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలన్నారు. తప్పకుండా ఈ విషయం తేలాలని అన్నారు. ఇటువంటివి చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్నానని.. కానీ ఏ ఒక్కరోజు కూడా రియాక్ట్‌ కాలేదని చెప్పారు.

దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. మూడు అంశాలపై జ్యుడీషియల్‌ ఎంక్వైరీ చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆ విచారణతో పాటు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలపై కూడా విచారణ చేయాలన్నారు.

Also Read:నో డైటింగ్..బరువు తగ్గెందుకు సింపుల్ చిట్కాలు!

- Advertisement -