రూ.500 కోట్లతో రహదారుల అభివృద్ధి:కోమటిరెడ్డి

8
- Advertisement -

నల్గొండ జిల్లాకు రూ.500 కోట్ల ఆర్‌అండ్‌బీ రహదారులు తెచ్చామని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.నల్గొండ జిల్లాలోని చిట్యాలలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోమటిరెడ్డి…హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై 17 బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు తెలిపారు.

తన జీవితం ప్రజలకే అంకితమని…తెలంగాణలో వారం రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల కార్యక్రమం చేపడతామని కోమటిరెడ్డి చెప్పారు. నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గాలు తనకు రెండు కళ్లలాంటివని వెల్లడించారు.

బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు రూ.400 కోట్లతో 80,000 ఎకరాలకు మూడు నెలల్లో నీళ్లు ఇస్తామని…రూ. 30 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు పనులు చేపట్టనున్నామని చెప్పారు.

Also Read:విటమిన్ సి..ఎన్ని ప్రయోజనాలో?

- Advertisement -