రాజస్థాన్‌పై కోల్ కతా గెలుపు

39
rr
- Advertisement -

రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది కోల్ కతా. రాజస్థాన్ విధించిన 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా..19.1 ఓవర్లలో 3 వికెట్లకు 158 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నితీష్‌ రాణా (37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌తో 48 నాటౌట్‌), రింకూ సింగ్‌ (23 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 42 నాటౌట్‌) 38 బంతుల్లో 66 పరుగులు జోడించడంతో.. కోల్‌కతా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా రింకూ సింగ్‌ నిలిచాడు.

తొలుత రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 152/5 స్కోరు చేసింది. సంజూ శాంసన్‌ (49 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 54) అర్ధ శతకం చేయగా.. హెట్‌మయర్‌ (13 బంతుల్లో ఫోర్‌, 2 సిక్స్‌లతో 27 నాటౌట్‌) ధాటిగా ఆడాడు. సౌథీ రెండు వికెట్లు తీశాడు. ఈ గెలుపుతో ఐదు వరుస పరాజయాలకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అడ్డుకట్ట వేసి… ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

- Advertisement -