ఐపీఎల్ 2021: టాస్ గెలిచిన కోల్‌కతా

199
- Advertisement -

ఐపీఎల్ 2021లో భాగంగా ఈరోజు అబుదాబి లోని షేక్ జాయేద్ స్టేడియంలో ముంబై ఇండియన్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కోల్‌కతా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి జట్టు 6 ఓవర్లు ముగిసేరికి వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ , క్వింటన్ డికాక్ ఉన్నారు.

ఈ మ్యాచ్ కోసం కోల్ కతా జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ముంబయి జట్టులో అన్మోల్ స్థానంలో సౌరభ్ తివారీని తీసుకున్నారు. అబుదాబి పిచ్ బౌలర్లకు అనుకూలిస్తున్నది. ప్రస్తుతం వాతావరణం కూడా పొడిగా, వేడిగా ఉండటంతో బంతి మరింత స్వింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పిచ్‌మీద స్పిన్నర్లకు 40 శాతం వికెట్లు లభించాయి.

తుది జట్లు ఇవి:

- Advertisement -