వీ4 క్రియేషన్స్ …”కోడి బుర్ర”

7
- Advertisement -

ఒకరికి ఒకరు, రోజాపూలు, స్నేహితులు, రాగల 24 గంటల్లో వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో శ్రీరామ్ కొత్త మూవీ “కోడి బుర్ర” ఈ రోజు హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని వీ4 క్రియేషన్స్ బ్యానర్ లో కంచర్ల సత్యనారాయణరెడ్డి, గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్ గౌడ్ నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్నారు. శృతి మీనన్, ఆరుషి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మహావీర్ మరో కీ రోల్ పోషిస్తున్నారు. కోడి బుర్ర సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతిథిలుగా పాల్గొన్న ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ క్లాప్ నివ్వగా దర్శకుడు భరత్ కమ్మ స్క్రిప్ట్ అందజేశారు. అనంతరం

ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ – కోడి బుర్ర చిత్రాన్ని మా మిత్రులు నిర్మిస్తున్నారు. మంచి కథను ఈ సినిమా కోసం ఎంచుకున్నారు. ప్రేక్షకుల్ని ఈ మూవీ ఆకట్టుకుని ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాం. హీరో శ్రీరామ్, హీరోయిన్ శృతి మీనన్, నిర్మాతలైన నా మిత్రులు, ఇతర టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

దర్శకుడు చంద్రశేఖర్ కానూరి మాట్లాడుతూ – ఈ రోజు మా కోడి బుర్ర సినిమా ప్రారంభోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో శ్రీరామ్ గారిని కొత్తగా చూస్తారు. ఆయన ఇప్పటిదాకా లవ్, రొమాంటిక్ తరహా చిత్రాలు చేశారు. కోడి బుర్ర సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. హీరోయిన్ శృతి మీనన్ డాక్టర్ రోల్ చేస్తోంది. కోడి బుర్ర అందరికీ నచ్చేలా మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా అవుతుందని నమ్ముతున్నాం. అన్నారు.

Also Read:Karthi:’మిస్టర్. X’ షూటింగ్ పూర్తి

- Advertisement -