లోకేశ్ సర్పంచ్‌గా గెలిస్తే..రాష్ట్రం వదిలి వెళ్లిపోతా: కొడాలి నాని

175
kodali nani
- Advertisement -

టీడీపీ నేత లోకేశ్‌కు బహిరంగ సవాల్ విసిరారు వైసీపీ నేత, మంత్రి కొడాలి నాని. చిత్తూరు నుండి లోకేశ్ సర్పంచ్‌గా గెలిస్తే తాను రాష్ట్రం వదిలి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై బురద చల్లడమే టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందన్నారు.

నిత్యవసర సరుకులు డోర్ డెలివరీ విధానాన్ని ఫిబ్రవరి 1 నుంచి అమలు చేస్తున్నామని, కొంతమంది రాజ్యాంగ సంస్థలు ఎన్నికల కోడ్ ను అడ్డం పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. టీడీపీ ఓ దిక్కు మాలిన పార్టీ…నిమ్మగడ్డ కు ఈ కార్యక్రమం పై ఫిర్యాదు చేసిందని అన్నారు.

ప్రజల్ని నమ్ముకుని పాలన చేస్తున్నామని, జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారని అన్నారు. ఎన్నికల అయ్యే లోపు చంద్రబాబును, లోకేష్ ను ప్రజలు రాష్ట్రం నుండి వెళ్ళగొడతారని ఆయన అన్నారు. కుట్రలు పన్నే అందరూ జగన్నాథరధ చక్రాల కింద పడి నలిగిపోతారని కొడాలి చెప్పుకొచ్చారు.

- Advertisement -