మళ్లీ రామ్‌చరణ్‌తో కియారా..!

104
ram
- Advertisement -

మెగాపవర్ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమాలో మెప్పించింది కియారా అద్వానీ. తాజాగా మరోసారి రామ్‌చరణ్‌తో రొమాన్స్ చేయనుంది కియారా. క్రియేటివ్ దర్శకుడు శంకర్‌ తీయనున్న పాన్ ఇండియా మూవీలో చెర్రీతో కలిసి జతకట్టనుంది కియారా.

రామ్‌చరణ్‌కు ఇది 15వ సినిమా కాగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో 50వ సినిమా. దిల్‌ రాజు, శిరీష్‌ ఈ సినిమాను నిర్మిస్తుండగా త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా స్పందించిన కియారా… రామ్‌చరణ్‌, శంకర్‌, దిల్‌ రాజు, శిరీష్‌ కలయికలో సినిమా చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని.. చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని చెప్పుకొచ్చింది.

- Advertisement -