మునుగోడుతో మతరాజకీయాలకు చెక్..

295
khatar trs
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికతో తెలంగాణలో మతరాజకీయాలకు చెక్ పడిందని టీఆర్ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని అన్నారు. బీజేపీ కుటల యత్నాలకు సీఎం కేసీఆర్ తన రాజకీయ చాణక్యతతో చెక్ పెట్టారని తెలిపారు. మునుగోడు మొనగాడు సీఎం కేసీఆరేనని స్పష్టం చేశారు.

వేల కోట్ల కాంట్రాక్టులు, ఎమ్మెల్యేలకు వందల కోట్లు ఆశచూపి నీచ రాజకీయాలు, స్వతంత్ర అభ్యర్థుల ఎన్నికల గుర్తులను ఏమార్చి మునుగోడు ప్రజలను మోసంచేయాలనుకున్న బీజేపీకి ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారన్నారు. 2023 సాధారణ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలతో కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని తెలిపారు.

ఈ సందర్భంగా ఉపఎన్నికల్లో అఖండ విజయం సాధించిన పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

 

- Advertisement -