బీఆర్ఎస్ సభ..నవశకానికి నాంది

42
niranjan
- Advertisement -

ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ సభ నవశకానికి నాంది అన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రైతుబంధు నిధులు రూ.550.14 కోట్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రకటన విడుదల చేసిన ఆయన..1,60,643 మంది రైతుల ఖాతాలలో నిధులు జమ అయ్యాయి. 11 లక్షల 306.38 ఎకరాలకు నిధులు విడుదల చేయగా ఇప్పటి వరకు మొత్తం 62 లక్షల 45 వేల 700 మంది రైతుల ఖాతాలలో రూ.6351.22 కోట్లు జమ అయ్యాయని తెలిపారు.

దేశ రాజకీయ చరిత్రలో ఒక మలుపురాయిలా నిలవనుందని…ఖమ్మం సభలో కేసీఆర్ సందేశం చారిత్రాత్మకం కానుందన్నారు. నాడు తెలంగాణ కోసం నేడు దేశం కోసం కేసీఆర్ ముందడుగు వేశారన్నారు. తెలంగాణ మాదిరిగానే దేశం సస్యశ్యామలం కావాలని..60 శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగం సుభిక్షంగా వర్దిల్లాలన్నారు.

అన్ని రంగాలను అమ్మేసినా కేంద్రం కన్ను ఆహారరంగం మీద పడిందని..కేసీఆర్ నాయకత్వంలో కేంద్రం కుట్రలను చేధిస్తాం అన్నారు. తెలంగాణ వ్యవసాయ పథకాలు, సంక్షేమ పథకాలు దేశమంతా అమలుకావాలని భారత ప్రజలు ఆశిస్తున్నారన్నారు.బీఆర్ఎస్ అడుగులు చూసి బీజేపీలో వణుకు పుడుతుందని అందుకే తెలంగాణ మీద కక్ష్యగట్టి నిధులు రాకుండా, రుణాలు అందకుండా అడ్డుపుల్లలు వేస్తుందన్నారు. బీజేపీకి ప్రజలే సమాధానం చెబుతారన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -