తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

49
ttd
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టగా భక్తులతో 26 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. నిన్న 69,804 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 29,615 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.54 కోట్లు వచ్చిందని వివరించారు. టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో స్వామివారి దర్శనం కలుగుతుందని అధికారులు తెలిపారు. శ్రీమలయప్పస్వామి, శ్రీ కృష్ణస్వామి లు వేర్వేరుగా వాహనాలపై తిరుచ్చిగా రాగా వేదపండితుల ఆధ్వర్యంలో పార్వేట మండపములో పుణ్యాహము, ఆరాధన, నివేదనము జరిగి హారతులు జరిగాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -