‘కేజీఎఫ్’ దర్శకుడితో ప్రభాస్‌ నెక్ట్స్‌ మూవీ..?

380
prabhas
- Advertisement -

బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ప్రభాస్‌ క్రేజ్‌ ఖండాంతరాలు దాటింది. హాలీవుడ్‌ హీరో రేంజ్‌ ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఈ రెబల్‌ స్టార్‌కు ఏర్పడింది. అయితే ‘సాహో’ తర్వాత ‘జిల్‌’ఫేం రాధాకృష్ణ సినిమాలో ప్రభాస్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడని తెలిసిందే. దీనికి సంబందించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణతో చేస్తున్న చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది. అయితే ప్రభాస్ తన తర్వాత సినిమా గురించి మరో వార్త హల్ చల్ చేస్తోంది.

‘కేజీఎఫ్’తో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇంతకు ముందు ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ తోగానీ .. మహేశ్ తోగాని సినిమా చేసే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. కానీ ఆ ఇద్దరి నెక్స్ట్ మూవీస్ వేరే దర్శకులతో సెట్ అయింది. దీంతో ప్రశాంత్ నీల్ .. ‘కేజీఎఫ్ 2’ తరువాత సినిమాను ప్రభాస్ తో చేయాలనే నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు. అంతేకాదు ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ ప్రశాంత్ నీల్‌కు కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చారట. దీనితో ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ ఓ సినిమా దాదాపు ఖాయం కావచ్చు అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. దీనిపై క్లారిటీ రావాల్సివుంది.

- Advertisement -