- Advertisement -
ఐపీఎల్ సీజన్ 13పై సోమవారం నిర్ణయం తీసుకోనున్నామని తెలిపారు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ. పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ను ఏప్రిల్ 30 వరకు పొడగించడంతో ఐపీఎల్ 2020పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు దాదా.
ఐపిఎల్ నిర్వహణ పై సోమవారం స్పష్టత ఇస్తానని ..కరోనా వైరస్ నేపథ్యంలో ఏం జరుగుతుందో అంతా గమనిస్తున్నామని తెలిపారు గంగూలీ.విమానాశ్రయాలు మూతపడ్డాయి,ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారని వెల్లడించారు.
ఎవరూ ఇంటి నుంచి బయటకు వెళ్లలేరని…ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లను ఎక్కడి నుంచి తీసుకొస్తారని తెలిపాడు. ఐపీఎల్ విషయాన్ని పక్కకు పెట్టాలని మీడియాకు సూచించిన దాదా ప్రపంచంలో ఏ టోర్నమెంట్ నిర్వహించడానికి అవకాశం లేదన్నాడు.
- Advertisement -