నవంబర్ 13 తర్వాత గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్‌!

128
ghmc
- Advertisement -

గ్రేటర్ ఎన్నికలపై మరింత క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి. ఈ నెల 13న ఓటరు జాబితా విడుదల అనంతరం ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

జీహెచ్‌ఎంసీలో 150 వార్డులు, 30 సర్కిళ్లు ఉన్నాయని..ప్రతి సర్కిల్‌కు ఒక డిప్యూటీ కమిషనర్‌ ఉన్నారని తెలిపిన పార్థసారథి… 150 డివిజన్లకు 150 మంది ఆర్‌ఓలను నియమించినట్లు తెలిపారు.

ప్రతి వార్డుకు సగటున 50 పోలింగ్‌ కేంద్రాలు ఉంటాయని పోలింగ్‌ను బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్వహించాల‌ని స్టేట్ ఎల‌క్షన్ క‌మిష‌న్ నిర్ణయించ‌డంతో 30 వేల బ్యాలెట్ బాక్సులు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని అంచ‌నా వేసినట్లు చెప్పారు.

- Advertisement -