కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా సినిమా థియేటర్లకు పోటీగా ఓటీటీలు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాయి. భారీ బడ్జెట్తో సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటికే పెద్ద పెద్ద సినీ నిర్మాతలు, ఇండస్ట్రీయలిస్టులు ఓటీటీల్లోకి ప్రవేశించగా తాజాగా కేరళ సర్కార్ సైతం అఫిషీయల్గా ఓటీటీని రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది, సీస్పేస్ పేరుతో ఓటీటీ సంస్థను ఏర్పాటుచేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
నవంబర్ 1 కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఓటీటీని అధికారికంగా ప్రారంభించనుంది. కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే ఈ ఓటీటీలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు, ఇతర వినోద కార్యక్రమాలను ప్రసారం చేయనున్నారు. జూన్ 1 నుంచి సినిమాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆరంభిస్తామని కేరళ అధికారులు వెల్లడించారు.