కేరళ..సెమీ హైస్పీడ్ రైల్వే లైన్!

4
- Advertisement -

కేరళ ప్రభుత్వం “సిల్వర్‌లైన్” పేరుతో సెమీ-హైస్పీడ్ రైల్వే లైన్ కోసం డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధం చేసింది. ఈ DPRను కేరళ రైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (KRDCL) తయారు చేసింది. ఇది కేరళ ప్రభుత్వం మరియు రైల్వే మంత్రిత్వ శాఖల సంయుక్త భాగస్వామ్య సంస్థ.

రైల్వే మంత్రిత్వ శాఖ KRDCLకు DPRను తాజా సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా సవరించాలని సూచించింది. ఇందులో బ్రాడ్ గేజ్‌ను స్వీకరించడం ద్వారా ప్రస్తుత రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానం, తక్కువ ఎత్తు వంకర (ఫ్లాటర్ గ్రాడియెంట్), యార్డులు మరియు ట్రాక్ భాగాల్లో సరైన డ్రైనేజ్ వ్యవస్థ, నిర్మాణం మరియు నిర్వహణ సమయంలో పర్యావరణ రక్షణ చర్యలు వంటి అంశాలు ఉన్నాయి.

అయితే, కేరళ ప్రభుత్వం సిల్వర్‌లైన్‌ను స్టాండ్అలోన్ ప్రాజెక్టుగా పరిగణించాలనే పట్టుదలతో ఉందని ప్రకటనలో పేర్కొన్నారు.ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో ప్రశ్నలకు సమాధానంగా వెల్లడించారు. 530 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రతిపాదిత రైల్వే మార్గాన్ని K-Rail అభివృద్ధి చేయనుంది. ప్రజా నిరసనలు, రాజకీయ పార్టీల వ్యతిరేకత మరియు కేంద్ర అనుమతుల్లో జాప్యం కారణంగా ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది.

Also Read:పచ్చి కూరగాయలు తింటున్నారా?

సిల్వర్‌లైన్ ప్రాజెక్ట్ ద్వారా ప్రస్తుతం ఏడుగంటలు పట్టే తిరువనంతపురం–కాసరగోడ్ ప్రయాణ సమయాన్ని నాలుగు గంటలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

- Advertisement -