Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా

4
- Advertisement -

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. సీబీఐ కేసులో బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. సీబీఐ ఇంకా కౌంటర్ దాఖలు చేయకపోవడంతో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్‌ ఐదో తేదీకి వాయిదావేసింది. .

విచారణ సందర్భంగా సీబీఐ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నదని కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ తెలిపారు. ఈ క్రమంలో సీబీఐ కౌంటర్‌ దాఖలుకు గడువు ఇస్తూ విచారణను వచ్చే నెల 5కు కోర్టు వాయిదా వేసింది. ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే.

Also Read:పోస్ట్ ప్రొడక్షన్‌లో ఈషా రెబ్బ మూవీ

- Advertisement -