గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న కీసరగుట్ట సర్పంచ్ మాధురి..

244
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు ఎంపీ & టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా… ఈరోజు కీసర గ్రామపంచాయితీ , రంగారెడ్డి జిల్లా ఎన్నుకొని రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా పాలకవర్గంతో పాటు కీసర గ్రామ పంచాయతీ కార్యాలయంలో మొక్కలు నాటారు సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేష్.

ఈ సందర్బంగా సర్పంచ్ మాధురి వెంకటేష్ మాట్లాడుతూ గ్రామాలు దత్తత తీసుకోవడం విన్నాం , పాఠశాలలు , అనాధ పిల్లలను దత్తత తీసుకోవడం విన్నాం కానీ అడువులు దత్తత తీసుకునే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన ఎంపీ సంతోష్ కుమార్ అని తెలిపారు . కీసర గుట్టను దత్తత తీసుకున్న ఏకైక రాజకీయ నాయకులూ మన సంతోష్ కుమార్అని , అప్పటి నుండి కీసర గుట్ట అభివృద్ధి పథం లో నడుస్తుందని , గ్రామ పంచాయితీ గా ఎన్నుకొని నేటికీ రెండు సంవత్సరాలు పూర్తి అయినందున ఈ రోజు మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు . ఈ సందర్బంగా ఎంపీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కీసర గుట్ట సర్పంచ్ నాయకపు మాధురి.

- Advertisement -