వాణిజ్య శాఖ పన్నుల అధికారులతో సీఎస్ సోమేశ్ సమీక్షా..

119
cs somesh
- Advertisement -

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం అమలులో ఉన్న రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు,రెన్యూవల్స్, తనిఖీ లు, రికార్డులు, రిపోర్ట్స్ తదితర అంశాలకు సంబంధించిన చట్టాలు, నిబంధనలలో Compliance burden ను తగ్గించుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.

ప్రభుత్వంలోని 7 శాఖలు – రెవెన్యూ(వాణిజ్య పన్నుల మరియు ఎక్సైజ్), పౌరసరఫరాలు, రవాణా , ఎనర్జీ, హోం, పురపాలక మరియు కార్మిక, ఉపాది శిక్షణ శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. Reducing Compliance burden పై కేంద్ర ప్రభుత్వమునకు చెందిన DPIIT ( Dept for Promotion of Industry and Internal Trade) వారు పంపిన అంశాలపై చేపట్టిన చర్యలను శాఖల వారీగా సమీక్షించారు. వినియోగదారుని దృక్పధంలో ఆలోచించి, సాధ్యమైనంత మేరకు వ్యక్తిగత పరిశీలనను తగ్గించుటకు, ఆన్ లైన్ ప్రక్రియను అనుసరించుటకు compliance burden ను తగ్గించాలని ఆదేశించారు.

ఈ simplification process ను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు గారి ఆలోచనలకు అనుగుణంగా ఇతర శాఖలలో ఉన్న సంక్లిష్ట నిబంధనలను పరిశీలించి, సులభతరం చేయుటకు compliance burden reduce చేయుటకు కార్యాచరణకై విధి విధానాలను రూపొందించి, సర్కులేట్ చేయాలని ఐ టి, పరిశ్రమలు శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ కు చెప్పారు.

ఈ సమావేశంలో కార్మిక, ఉపాది శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి రాణి కుముదిని, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రవి గుప్తా, పౌరసరఫరాల శాఖ ఈవో కార్యదర్శి శ్రీ అనీల్ కుమార్ , పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, కమీషనర్, CT, నీతూ కుమారి ప్రసాద్, కార్మిక శాఖ కార్యదర్శి శ్రీ అహ్మద్ నదీమ్, ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ శ్రీ ఎం ఆర్ ఎం రావు, సీడీఎంఏ సత్యనారాయణ మరియు తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -