సమంతకు షాక్ ఇచ్చిన కీర్తీ సురేష్‌..

276
Keerthy Suresh Samantha
- Advertisement -

ఇండస్ట్రీలో ఎవరి అవకాశాలను.. ఎవరు ఎప్పుడు లాగేసుకుంటారో చెప్పలేం. పక్కా కాన్ఫామ్ అనుకున్న పాత్రలో కూడా అనుహ్యంగా నటీనటులు మారిపోతుంటారు. సమంత విషయంలో కూడా సేమ్ అలాంటిదే సంఘటనే జరిగింది. సమంతకు వచ్చిన గొప్ప అవకాశాన్ని..కీర్తీ సురేష్ లాగేసుకుంది. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుందని టాలీవుడ్‌ లో ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. ‘ఎవడే సుబ్రమణ్యం’తో విజయాన్ని అందుకున్న నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం అందిచనున్నాడు. ఇన్ని రోజులు సావిత్రి జీవిత స్టోరీపై కసరత్తులు చేసిన దర్శకుడు పూర్తీ స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నాడు. దీంతో ఇప్పుడు నటీనటుల ఎంపికలో నిమగ్నమైయ్యాడు. అయితే సావిత్రి పాత్ర కోసం మొదట నిత్యమేనన్‌, సమంత, తదితర కథానాయికల్ని పరిశీలించారు.

Keerthy Suresh

నిత్యామీనన్ ను కాదని సమంతకు ఆ అవకావం దక్కింది. సమంత అయితే పాత్రలో బాగా ఒదిగిపోతుందని అమ్మడుకే ఛాన్స్ ఇచ్చారు. సమంత కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక సినిమా సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యం అనుకొంటున్న తరుణంలో కీలకమైన మార్పు జరిగింది. సావిత్రి పాత్ర కోసం సమంతని కాదని, కీర్తి సురేష్‌ని ఎంపిక చేశారు. ‘నేను శైలజ’తో ఆకట్టుకొన్న కీర్తి సావిత్రి సావిత్రి సినిమా అనగానే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది. దీంతో సమంతకు కీర్తీ సురేష్ పెద్ద షాక్ ఇచ్చినట్టు అయింది. సావిత్రి అంటే దక్షిణాదిలో లెజెండ్ హీరోయిన్‌గా పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి. మరి అలాంటి నటి పాత్ర అంటే మాములు విషయం కాదు. అలాంటిది కీర్తీకి ఈ అవకాశం దక్కడం అందరు చాలా ఆశ్చర్యపోతున్నారు. ఈ చిత్రాన్ని అశ్వనీదత్‌ నిర్మిస్తారు. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట.

- Advertisement -