మహేష్‌పై కీర్తి సురేష్‌ షాకింగ్‌ కామెంట్స్‌..!

154
Keerthy Suresh
- Advertisement -

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుపై హీరోయిన్ కీర్తి సురేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు మాట్లాడుతూ.. ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ టైంలో ఓ పాట షూటింగ్ సందర్భంగా తాను టైమింగ్ ను కోల్పోయానని, స్టెప్పులు మరిచిపోయానని చెప్పింది. అయితే ఆ సమయంలో మహేష్‌ మొహంపై రెండు సార్లు మిస్ టైమింగ్ తో కొట్టానని చెప్పింది.

అప్పటికే సారీ చెప్పానని, మూడో సారీ అది రిపీట్ అయిందని కీర్తి పేర్కొంది. ఆ టైంలో తన గుండె వేగం రెట్టింపైందని చెప్పింది. ‘నా మీద ఏమైనా పగ ఉందా?’ అంటూ మహేష్‌ తనను సరదాగా అడిగారని చెప్పింది కీర్తి. అయతే ఇద్దరి మధ్య జరిగిన సరదా సన్నివేశాలను చెప్పుతూ ఆమె సారీ చెప్పింది. తన పంచ్ డైలాగులతో మహేష్‌ బాబు టీజ్ చేశారా? లేదా? అని ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించగా ఆమె సమాధానం చెప్పింది. మహేష్‌ బాబుతో షూటింగ్ చేయడం సరదా సరదాగా ఉంటుందని కీర్తి చెప్పింది.

- Advertisement -