- Advertisement -
బసవేశ్వరుని జయంతి సందర్భంగా వీర శైవ లింగాయత్, లింగ బలిజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో వర్ణ, కుల, లింగ వివక్షతను రూపుమాపడం కోసం అహర్నిశలూ కృషి చేసిన అభ్యుదయవాది బసవేశ్వరుడని సీఎం కొనియాడారు. సాహితీవేత్తగా, ఆనాటి పాలనా వ్యవస్థలో భాగస్వామిగా సమానత్వం కోసం, ప్రజా సంక్షేమం కోసం పోరాడిన బసవేశ్వరుని సిద్ధాంతం భారత మత, సామాజిక చరిత్రలో విప్లవాత్మకమైనదిగా నిలిచిపోయింది. మానవీయమైన బసవేశ్వరుని ఆశయాలు నేటికీ ఆచరణీయం అని సీఎం కేసీఆర్ తెలిపారు.
- Advertisement -