సోలిపేట సుజాతకు పార్టీ బి ఫామ్‌ అందించిన కేసీఆర్..

170
trs
- Advertisement -

దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత బుధవారం సాయంత్రం మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సుజాతకి పార్టీ బి ఫామ్ ను అందజేశారు. పార్టీ కోసం, ప్రజల కోసం పాటు పడాలి అని జరగబోయే ఉప ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేసి అత్యధిక మెజార్టీతో గెలవాలని సీఎం కేసీఆర్ చెప్పారు.

బీ ఫామ్ అందుకున్న సుజాత మాట్లాడుతూ.. దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి ఇచ్చిన ప్రోత్సాహం, ఆశీస్సులు అదేవిధంగా కొనసాగించాలని, మీరు నా పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతాన్నారు. మీ ఆశీస్సులతో ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుస్తా అని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -