ఇది జనమా..ప్రభంజనమా : కేసీఆర్‌

189
kcr speech
- Advertisement -

టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ‘ప్రగతి నివేదన సభ’ తెలంగాణ ప్రజలతో జాతరని తలపించింది. భారతరాజకీయాల్లోనే చరిత్రలో నిలిచియేలా ఈ బహిరంగ సభను సక్సెస్‌ చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆశని తెలంగాణ ప్రజలు నెరవేర్చారు. ఆదివారం జరిగిన ఈ సభాప్రాంతం గులాబీమయంగా మారడమే కాకుండా లక్షలాదిగా జనం తరలివచ్చారు. అయితే ఈ భారీ బహిరంగ సభకు హాజరైన కేసీఆర్‌ తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.

అనంతరం తన ప్రసంగాన్ని ప్రారంభించిన కేసీఆర్ మాట్లాడుతూ…రాష్ట్రంలోని ప్రజలంతా ప్రగతి నివేదన సభకు తరలివచ్చి ఇది జనమా..ప్రభంజనమా అనేలా లక్షలాదిగా ప్రజలు కదలిరావడం ఎంతో ఆనందాన్ని కలిగించింది అన్నారు. ఈ అశేష ప్రజానీకాన్ని చూసి ప్రపంచమే అబ్బురపడుతోందన్నారు.

ఇంతటి జనాన్ని చూస్తుంటే..2001 నుంచి స్మృతులు గుర్తొస్తున్నాయని తెలిపారు. ఈ సభను చూస్తుంటే 18 ఏళ్ళకిందటి జ్ఞాపకాలు కళ్ళముందు కనిపిస్తున్నాయని గుర్తుచేసుకున్నారు.

- Advertisement -