KCR:ఢిల్లీ లిక్కర్ స్కాం..మోడీ కల్పితం

10
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం మోడీ కల్పితం అని మండిపడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బస్సుయాత్రలో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడిన కేసీఆర్..రాజకీయ లాభం కోసమే లిక్కర్‌ స్కాం పేరుతో పార్టీలను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ మోడీ కల్పితమని.. దేశంలోని న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉందని తెలిపారు.

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను ఇంత వరకు అమలు చేయలేదని, రైతుబంధుపై కాంగ్రెస్‌ సర్కారు మాట తప్పిందని విమర్శించారు. ఇంత వరకు రైతుబంధు ఇవ్వలేదని.. కాంగ్రెస్‌ సర్కారుపై అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.

కేంద్రంలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాదదని.. రాజ్యాంగాన్ని మార్చడంలో తప్పులేదని బీజేపీ నేతలు చెబుతున్నారన్నారు. కాంగ్రెస్‌ తప్పుడు హామీలతో ప్రజలు మోసపోయారని.. 12 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ రెండు పార్టీలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. దేశంలో రైతులు కష్టాల్లో ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ అవినీతి గురించి దేశం మొత్తం తెలుసని.. కాంగ్రెస్‌ కాదు.. స్కాంగ్రెస్‌ పార్టీ అంటూ విమర్శించారు.

Also Read:Harishrao:రేవంత్‌ చేసేవి తప్పుడు పనులు

- Advertisement -