కేంద్రానికి 24 గంటల డెడ్‌లైన్: సీఎం కేసీఆర్

32
- Advertisement -

కేంద్రానికి 24గంటల డెడ్ లైన్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన రైతు నిర‌స‌న దీక్ష‌లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. 24 గంట‌ల్లోపు ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

తెలంగాణ నుంచి సుమారు 2 వేల కి.మీ. దూరం వ‌చ్చి దీక్ష చేస్తున్నాం. ఇంత దూరం వ‌చ్చి ఆందోళ‌న చేయ‌డానికి కార‌ణ‌మెవ‌రు? న‌రేంద్ర మోదీ ఎవ‌రితోనైనా పెట్టుకో.. కానీ రైతుల వ‌ద్ద మాత్రం పెట్టుకోవ‌ద్దు. ప్ర‌భుత్వంలో ఎవ‌రూ శాశ్వతంగా ఉండ‌రు. కేంద్రం ధాన్యం కొనాల‌ని ఢిల్లీలో దీక్ష చేస్తున్నాం. దీక్ష‌కు మ‌ద్ద‌తిచ్చేందుకు వ‌చ్చిన రాకేశ్ తికాయ‌త్‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు కేసీఆర్.

దేశంలోని రైతులు భిక్ష‌గాళ్లు కాదు.. ఒకే విధానం లేక‌పోతే రైతులు రోడ్ల‌పైకి వ‌స్తార‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. మోదీ, పీయూష్ గోయ‌ల్‌కు రెండు చేతులు జోడించి విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాల‌ని కోరుతున్నాన‌ని కేసీఆర్ పేర్కొన్నారు.ప్ర‌ధాని స్వ‌రాష్ట్రం గుజ‌రాత్‌లో విద్యుత్ కోసం రైతుల ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయ‌ని కేసీఆర్ తెలిపారు.

- Advertisement -