ప్లాస్టిక్ నిషేధంపై విస్తృత స్థాయి చర్చ..

447
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు అంశాలపై చర్చించింది. ప్రభుత్వ ఉద్యోగులకు 1 జనవరి నుంచి 1 జూలై వరకు డి.ఎ.ను 3.144 శాతం పెంచాలని నిర్ణయించింది. దీంతో ఉద్యగుల మొత్తం డి.ఎ. 33.536 శాతానికి చేరుకుంటుంది. రాష్ట్రంలో ప్లాస్టిక్ ను నిషేధించాలనే విషయంపై విస్తృత చర్చ జరిగింది. ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి అధికారుల కమిటీని నియమించాలని నిర్ణయించింది.

Plastic

కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటైన నేపథ్యంలో వాటికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను కూడా పునర్వ్యవస్థీకరించే అంశం పరిశీలించాలని కేబినెట్ పోలీసు శాఖను కోరింది. శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

- Advertisement -